ఐఎండీ హెచ్చరికలు! తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!
Sat May 17, 2025 09:03 Others.202505175795.jpg)
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న ఐదు రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. IMD హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. రుతుపవనాలు ఉత్తర భారతంలో ప్రారంభమై దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర.. తదితర రాష్ట్రాల్లో మే 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు దిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు వస్తాయని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు స్పష్టత నిచ్చింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 20- 22వ తేదీ నాటికి ఇది మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది అల్పపీడనంగా మారనున్నట్లు తెలిపింది. మే 23 నుంచి 28 మధ్య తుపానుగా మారేందుకు అనుకూలంగా ఉంది. దీనికి శక్తి అని పేరు పెట్టారు. ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #IMDAlert #HeavyRains #TeluguStates #AndhraPradeshWeather #TelanganaWeather #RainAlert
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.